Friday, November 14, 2008

శాంతి మార్గం...











కుల ఆధిపత్యం విధ్యార్థుల నడుమ విధ్వంసాన్ని సృష్టిస్తే.. ఫలితం అధికారులు అనుభవించాల్సి వస్తుందనేందుకు చెన్నైలోని లా కళాశాలలో వెలుగు చూసిన సంఘటనే సాక్ష్యం. రాజకీయ ప్రయోజనాలకు కొన్ని పార్టీలు విధ్యార్థులను పావులుగా వాడుకుంటే.. అదే రాజకీయం అధికారులను చేతులు కట్టుకోమని ఆదేశించాయి. చివరకు తమ మనుగడకోసం అధికారులను బలిపశువులను చేసి చోధ్యం చూస్తున్నాయ్. ఇదే రాజకీయమంటే అని స్వార్థ ప్రయోజనాలకు మార్గాన్ని సుగమనం చేసి నవ్వుకుంటున్నాయ్. అందుకే భవితగల విధ్యార్థి మేలుకో నీ ఉన్నతికి నీవే మార్గాన్ని చూసుకో ఉన్నత శిఖరాలను అధిరోహించు.

మేఘన గుండ్ల